క‌రోనా మ‌హ్మ‌మారి రోజురోజుకి విజృభిస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా నివార‌ణ‌కు అన్ని దేశ ప్ర‌భుత్వాలు, ప్ర‌జ‌లు త‌గు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా క‌రోనా ప్ర‌భావం తీవ్రంగా నెల‌కొంది అంతే ధీటుగా తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు సైతం నివార‌ణ కార్య‌క్ర‌మాలు చేస్తున్నాయి. ప్ర‌‌భుత్వం తీసుకుంటున్న నివార‌ణ చ‌ర్య‌ల‌కు మ‌ద్ధ‌త్తుగా ప‌లువురు పారిశ్రామికవెత్త‌లు, సినీ ప్ర‌ముఖులు భారీ ఎత్తున ఆర్ధిక స‌హకారం అందిస్తున్నారు. అలాగే కరోనా విపత్తుపై వీడియోల రూపంలోనూ, పాటల రూపంలోనూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. అలాంటివారిలో డైలాగ్ కింగ్ సాయికుమార్ కూడా ఒకరు. ఆయన సినీ కార్మికుల సంక్షేమం కోసం రూ. 5లక్షలు, డబ్బింగ్ యూనియన్ కోసం రూ. 2లక్షలు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజాగా సాయికుమార్ ఆయన కుమారుడు ఆదితోనూ, కుమార్తె జ్యోతిర్మయితో కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. కరోనాపై యుద్ధానికి తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తున్న వైద్యులు, పోలీస్ శాఖ , పారిశుధ్య కార్మికులు చేస్తున్న కృషిని వివరిస్తూ చేసిన షార్ట్ ఫిల్మ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో సాయికుమార్ పోలీస్ గా, ఆది పారిశుధ్య కార్మికుడిగా, జ్యోతిర్మయి డాక్టర్ గా నటించడం విశేషం.

షార్ట్ ఫిల్మ్ వీక్షించడానికి కింది లింక్ మీద క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=isL_g72NDcE&feature=youtu.be

Leave a comment

error: Content is protected !!