ఒకప్పుడు టాలీవుడ్ లో సక్సెస్ కు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచాడు దర్శకుడు తేజ. ఆ తర్వాత కొన్ని అర్ధం పర్ధం లేని చిత్రాలతో తన ఫామ్ ను పూర్తిగా కోల్పోయాడు. అయితే మూడేళ్ళ క్రితం దగ్గుబాటి రానా  ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా సక్సెస్  తో తిరిగి బౌన్స్ బ్యాక్ అయిన తేజ .. ఆపై  కాజల్  ‘సీత’ మూవీతో మరోసారి పరాజయం బాట పట్టాడు. అయితే … రీసెంట్ గా ఒకేసారి రెండు సినిమాలను అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చాడు తేజ.   ఆ రెండు చిత్రాలూ డిఫరెంట్ జోనర్స్ లో .. ఇద్దరు వేరు వేరు హీరోలతో, వెరైటీ టైటిల్స్ తో  త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్నాయి.

తేజ త్వరలో దగ్గుబాటి రానా తోనూ, గోపీచంద్ తోనూ రెండు వేరు వేరు సినిమాలు తెరకెక్కించనున్నాడని,  వాటి టైటిల్స్ ను కూడా    మూవీ వాల్యూమ్ ఎప్పుడో రివీల్ చేసింది .  కాకపోతే ..  ఇప్పుడు ఆ రెండు ప్రాజెక్ట్స్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు తేజ.  నెగెటివ్ షేడ్స్ తో ఉన్న ఒక పవర్ ఫుల్ పాత్రను రానా  పోషిస్తోన్న చిత్రానికి ‘రాక్షసరాజు రావణాసురుడు’  అని ,  ‘అలివేలుమంగ వెంకటరమణ’ అనే టైటిల్ ను గోపీచంద్ చిత్రానికి ఖాయం చేశారు.  ఇక ఈ రెండు సినిమాల కేస్టింగ్ ను త్వరలో ప్రకటించనున్నారు. అలాగే.. ఈ రెండు చిత్రాల్ని ఒకేసారి సెట్స్ మీదకు తీసుకెళ్ళి సైమల్ టేనియస్ గా షూట్ చేయాలని తేజ ప్లాన్ చేస్తున్నాడట. మరి ఈ రెండు చిత్రాలు తేజకు ఏ రేంజ్ సక్సెస్ ఇస్తాయో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!