ఒకప్పుడు టాలీవుడ్ లో మణిశర్మ సంగీతం అందిస్తున్నాడనేసరికి.. ఆ పాటలు సూపర్ హిట్టనే సెంటిమెంట్ ఉండేది జనాల్లో . దానికి తగినట్టుగానే ఆయన ఎందరో స్టార్ హీరోల సినిమాలకు సూపర్ మ్యూజిక్ అందించారు. అయితే సినిమాలకు కొంత కాలం బ్రేక్ ఇచ్చిన ఆయన.. తిరిగి ఇస్మార్ట్ శంకర్ తో రీఛార్జ్ అయిన సంగతి తెలిసిందే. అందులో పాటలన్నీ సూపర్ హిట్టవడంతో.. మళ్ళీ మణిశర్మ టాలీవుడ్ లో బిజీ అయ్యారు. అదే టైమ్ లో ఆయన కొడుకు మహతీ  స్వరసాగర్  కూడా మంచి అవకాశాలు అందుకుంటున్నాడు. ఛలో, భీష్మలో పాటలు యూత్ కు బాగా నచ్చేశాయి.

ఇప్పుడు ఈ తండ్రీ కొడుకులిద్దరితోనూ మెగాస్టార్ చిరంజీవి ఒకేసారి సినిమాలు చేసే అవకాశముందని టాక్. అదెలా అంటే.. ప్రస్తుతం చిరంజీవి, కొరటాల ఆచార్య సినిమాకి సంగీతం మణిశర్మే అందిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుందని సమాచారం. అలాగే.. చిరు .. మెహర్ రమేశ్ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ మెంట్ ఇచ్చారు. ఆ సినిమా అజిత్ వేదాళం సినిమాకి రీమేక్ వెర్షన్ . దీనికి మహతి  స్వర సాగర్  సంగీతం అందించబోతున్నాడని తెలుస్తోంది. సో.. మెగాస్టార్ ఇటు తండ్రితోనూ, అటు కొడుకుతోనూ ఒకేసారి వర్క్ చేస్తూండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.   

Leave a comment

error: Content is protected !!