Shopping Cart 0 items - $0.00 0

ఇంద్రగంటి దర్శకత్వంలో మహేశ్ ?

సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకొని..  ఆ ఆనందాన్నంతటినీ ఫ్యామిలీతో ఫారిన్ లో పంచుకున్నాడు  మహేశ్ బాబు. అయితే ఇప్పుడు తదుపరి చిత్రం దగ్గరే చిన్న పేచీ వచ్చింది. వంశీ పైడిపల్లి సినిమా కేన్సిల్ అవడంతో.. ఇప్పుడు సీన్లోకి పరశురామ్ వచ్చాడు. అయితే 14రీల్స్ ప్లస్ బ్యానర్ కు, మైత్రీ వారికి మధ్య చిన్న వార్ నడుస్తూండడంతో.. అతడు కూడా డౌటే అంటున్నారు. ఈ నేపథ్యంలో   మహేశ్ కు ఇప్పుడు దర్శకుడే లేకుండా పోయాడు.

అయితే ఆ  బాధ్యతను మైత్రీ మూవీస్ వారే తీసుకోవడం విశేషం. అంటే.. తమ బ్యానర్ లోనే.. వేరే దర్శకుడితో మహేశ్ సినిమాను సెట్ చేయడం అన్నమాట. ‘వీ’ మూవీ తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ మైత్రీవారికి మరో సినిమా చేయాల్సి ఉంది. దాన్ని ఇప్పుడు మైత్రీవారు మహేశ్ విషయంలో వాడుకుంటున్నారని సమాచారం. ముంబై లో ఉన్న మహేష్ కు మైత్రీ వారు అర్జెంట్ గా కాల్ చేసి ఇంద్రగంటితో అప్పాయింట్ మెంట్ ఫిక్స్ చేశారట. రేపో ఎల్లుండో సూపర్ స్టార్ ఆ కథ వినడానికి రానున్నాడని సమాచారం. అన్నీ సవ్యంగా జరిగితే..  మహేశ్ బాబు నెక్స్ట్ మూవీ ఫిక్స్ అయిపోయినట్టే. మరి ఇంద్ర గంటి సుడి ఎలా ఉండబోతోందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!