మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబో మూవీ ‘ఆచార్య’ ప్రస్తుతం  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ ఆగస్ట్ లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో త్రిష కృష్ణన్ కథానాయికగా నటించబోతోందని నిన్నటి మొన్నటి వరకూ వార్తలు వినిపించాయి. కానీ రీసెంట్ గా త్రిష తన ట్విట్టర్ పేజ్ లో చిరుతో తాను నటించడం లేదని, క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా తాను ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నానని క్లారిటీ ఇచ్చింది. దాంతో ఈ మూవీలోని హీరోయిన్ ఎంపిక మళ్ళీ సందిగ్ధంలో పడింది. అయితే త్రిష ప్లేస్ లోకి కాజల్ అగర్వాల్ రానుందని తాజా సమాచారం.

చిరు, కాజల్ జోడీ ఇంతకు ముందు ‘ఖైదీనెంబర్ 150’ లో అభిమానులకు కనువిందు చేసింది. ఇప్పుడు మరోసారి మెగాస్టార్ కాజల్ తో అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడూ ఎగైన్ అంటూండడం విశేషాన్ని సంతరించుకుంది. ప్రస్తుతం కాజల్ తో సంప్రదింపులు జరుగుతున్నాయని.. ఆ మేరకు  కాజల్ నుంచి కూడా అనుకూలమైన సంకేతాలు అందుతున్నాయని వినికిడి. త్వరలోనే దీని గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందని తెలుస్తోంది. మరి చిరు, కాజల్ జోడీ ఈ సారి ఏ రేంజ్ లో అభిమానుల్ని అలరిస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!