Shopping Cart 0 items - $0.00 0

అమర సైనిక వీరులకు పవన్ కళ్యాణ్ కోటి రూపాయల విరాళం

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళడంతో ఏపీ రాజకీయాల్లో ఏదో జరగబోతోందనే ప్రచారం ప్రారంభం అయింది. కానీ పవన్ రాజకీయాలకు అతీతంగా ఒక గొప్ప పని చేపట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటు సినిమాలకు, అటు రాజకీయాలకు పూర్తిగా అంకితమైన పవన్ కళ్యాణ్ ఈ రోజు ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ టూర్ లో పవన్ కళ్యాణ్ అన్నమాట నిలబెట్టుకొని తన ఉదారత చాటుకున్నారు.

ఇదివరకే ఆయన అమర సైనిక వీరుల కుటుంబాల సంక్షేమానికి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. దానికి సంబంధించిన చెక్‌ను ఇచ్చేందుకు ఆయన సైనికాధికారుల్ని కలిశారు. ఇందుకోసం కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయానికి వెళ్లి… రూ.కోటి విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా సైనిక అధికారులు పవన్ కళ్యాణ్‌ని ఆర్మ్‌డ్ ఫోర్స్ బ్యాడ్జితో గౌరవించారు.

Leave a comment

error: Content is protected !!