కార్తీ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ ‘ఖైదీ’. తమిళ, తెలుగు భాషల్లో ఈ మూవీ బిగ్గెస్ట్ సక్సెస్ అవడమే కాకుండా.. విమర్శకుల నుంచి సినిమాకి పెద్ద ఎత్తున ప్రశంసలు కూడా దక్కాయి. స్ర్కీన్ ప్లే ప్రధానంగా సాగే ఈ సినిమా..  త్వరలో బాలీవుడ్ లో రీమేక్ కానుందని, అందులో హీరోగా సంజయ్ దత్ నటిస్తున్నాడని ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడా సినిమాలో అజయ్ దేవ్ గణ్ హీరోగా నటించబోతున్నట్టు  అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది.

రీసెంట్ గా తన ట్విట్టర్ ఖాతాలో అజయ్ దేవ్ గణే స్వయంగా ‘ఖైదీ’ లో తను హీరోగా నటిస్తున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.  అంతేకాదు సినిమా ఫిబ్రవరి 12, 2021 లో విడుదల కానున్నట్టు రివీల్ చేశాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న బాలీవుడ్ ‘ఖైదీ’ .. అజయ్ దేవ్ గణ్ కెరీర్ లోనే ఒక వైవిధ్యమైన చిత్రం కానుంది. హీరోయిన్స్, పాటలు లేకుండా.. కేవలం గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే ..ఆసక్తికరమైన సన్నివేశాలతో రూపొందిన ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా లోకేశ్ కనగరాజే దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. మరి ఖైదీగా అజయ్ దేవ్ గణ్ ఎలా మెప్పించబోతాడో చూడాలి.

Leave a comment

error: Content is protected !!